స్టార్ హీరోల కోసం ప్లాన్ చేస్తోన్న స్టార్ డైరెక్టర్ !

‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని అనుకున్నారు. కానీ పైడిపల్లి చెప్పిన కథ మహేష్ బాబుకు నచ్చలేదని, అందుకే ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారని వార్తలు వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం దర్శకుడు వంశీ పైడిపల్లి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గాని, ప్రభాస్ తో గాని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ప్రభాస్ తో సినిమా అంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే. ఈ లోపు చరణ్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు వంశీ.

కాగా త్వరలోనే చరణ్ కి కథ చెప్పి ఒప్పించాలని వంశీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా ఉండబోతోందని, ప్రత్యేకంగా క్రేజీ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ తో వంశీ పైడిపల్లి సినిమాని రూపొందించనున్నారట. ఇక వంశీ, చరణ్ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే ఉంటాయి. పైగా వంశీ లాస్ట్ మూవీ ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. మరి ఈ సారి వంశీ రామ్ చరణ్ తో సినిమా చేస్తే ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.

Exit mobile version