బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చాలా సింపుల్ గా ఉంటాడు. సింపుల్గా ఉన్నా చాలా ఎమోషనల్ గా ఉంటాడు. ఐతే, అమీర్ ఖాన్ ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్తో తాను కలిసి దిగిన ఓ పాత ఫొటో ఇటీవల వైరల్ కావడంపై అమీర్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘తుర్కియే ఆ విధంగా చేయడం సరికాదు. ఆ దేశ తీరుపట్ల ప్రతి భారతీయుడు ఆగ్రహానికి గురయ్యాడు. కొన్నేళ్ల క్రితం తుర్కియేలో భారీ భూకంపం వచ్చింది. క్లిష్ట సమయంలో ఆ దేశానికి సాయం చేయడంలో భారత్ ముందుంది’ అని అమీర్ చెప్పారు.
అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘సుమారు ఏడేళ్ల తర్వాత ఎర్డోగాన్ ఇలా వ్యవహరించడం సరికాదు. ఒక నటుడిగా మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర దేశాలకు వెళ్తుంటా. అక్కడి వారితో ఫొటోలు దిగుతుంటా. ఆనాటి ఫొటోలను ఉపయోగించి ఇప్పుడు ఎలా ట్రోల్ చేస్తారు? తుర్కియే అధ్యక్షుడు ఈ విధంగా చేస్తారని 2017లో నాకు తెలియదు కదా’’ అని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. అమీర్ నటించిన ‘సితారే జమీన్ పర్’ చిత్రాన్ని బాయ్కాట్ చేయాలని పలువురు పోస్టులు షేర్ చేశారు.