ఫోటో మూమెంట్ : థగ్ లైఫ్ ఆలిండియా ప్రమోషన్స్ షురూ.. ముంబై నుంచి స్టార్ట్!

కోలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘థగ్ లైఫ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా చిత్రంలో స్టార్ హీరో కమల్ హాసన్‌తో పాటు శింబు కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కాగా, దానికి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది.

ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డు బద్దలు కావడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటంతో ఈ చిత్ర ప్రమోషన్స్‌ను ఆలిండియా స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు థగ్ లైఫ్ టీమ్ ముంబై నుంచి తమ ప్రమోషన్స్ షురూ చేసేందుకు తాజాగా అక్కడికి పయనమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మణిరత్నం మార్క్ చిత్రంగా థగ్ లైఫ్ రానుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో త్రిష, జోజు జార్జ్, అశోక్ సెల్వన్, నాజర్, అభిరామి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version