“విశ్వంభర” నుంచి మొదట వచ్చేది ఈ పాటే!?

“విశ్వంభర” నుంచి మొదట వచ్చేది ఈ పాటే!?

Published on Feb 22, 2025 9:00 PM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. అన్నీ బాగుండి ఉంటే ఈ పాటికి సినిమా రిలీజ్ అయ్యి థియేటర్స్ లో కూడా ఉండేది. అయితే ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రీసెంట్ గానే మేకర్స్ ఒక మాస్ సాంగ్ ని షూట్ చేశారు.

అయితే ఈ సాంగ్ పట్ల క్రేజీ బజ్ వినిపిస్తుంది. ఈ సాంగ్ రాముల వారిపై సాంగ్ కాగా కీరవాణి సాలిడ్ ట్యూన్ ని అందించారట. అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా కనిపించే సాంగ్ ఇదే అని తెలుస్తుంది. ఇక ఇదే సాంగ్ ని మేకర్స్ ఫస్ట్ సింగిల్ గా కూడా విడుదల చేస్తారని తెలుస్తుంది. మరి ఈ సాంగ్ ఉగాదికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు