‘బలగం’ మూవీతో టాలీవుడ్లో డైరెక్టర్గా సాలిడ్ గుర్తింపు పొందాడు కమెడియన్ వేణు యెల్దండి. తెలంగాణ గ్రామీణ కథాంశంతో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించింది. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యాక్ చేయడంతో ఈ మూవీకి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. అయితే, ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశాడు ఈ డైరెక్టర్.
మరోసారి పక్కా గ్రామీణ నేపథ్యంలో ‘యెల్లమ్మ’ అనే టైటిల్తో ఓ సినిమా చేయబోతున్నాడు ఈ వేణు యెల్దండి. ఇక ఈ సినిమాను కూడా దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ మూవీపై అప్పుడే బజ్ క్రియేట్ అయ్యింది. అయితే, ఈ సినిమాలో హీరో, హీరోయిన్ విషయంలో అనేక వార్తలు వినిపించాయి. కాగా, ఈ సినిమాలో హీరోగా నితిన్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక హీరోయిన్గా స్టార్ బ్యూటీ సాయి పల్లవి నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు సంబంధించి ఓ సాలిడ్ న్యూస్ సినీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా కథ గ్రామ దేవత చుట్టూ తిరుగుతుందని.. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండనుందని.. ఈ పాత్ర సాలిడ్ ఎమోషనల్ ఇంపాక్ట్ చూపెడుతుందని మేకర్స్ చెబుతున్నారు. అందుకే ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని సెలెక్ట్ చేసినట్లుగా వారు చెబుతున్నారట. అయితే, ఈ సినిమాకు సాయి పల్లవి ఓకే చెప్పిందా లేదా.. అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.