మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్-నీల్ మూవీపై అభిమానులతో పాటు సినీ సర్కిల్స్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నేడు జాయిన్ అవుతున్నారు. కాగా, ఇప్పుడు ఈ భారీ బడ్జెట్ చిత్రంలోకి ప్రముఖ నిర్మాణ సంస్థ టి-సిరీస్ కూడా యాడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఈ బ్యానర్ కూడా బడ్జెట్ కేటాయించనుంది. ప్రతిఫలంగా ఈ చిత్రానికి సంబంధించిన నాన్-థియేట్రికల్ రైట్స్తో పాటు ఈ సినిమాలో షేర్ కూడా టి-సిరీస్ తీసుకోనుందట.
భారీ యాక్షన్ సీక్వెన్స్తో ఎన్టీఆర్ ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. ఇక ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.