ఈ కొత్త క్రష్ ను గట్టిగా ఫిక్స్ అయ్యిపోయారు.!

ఈ కొత్త క్రష్ ను గట్టిగా ఫిక్స్ అయ్యిపోయారు.!

Published on May 14, 2020 10:44 PM IST

మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఓ కొత్త హీరోయిన్ పరిచయం అయితే ఆమె హవా మన దగ్గర యువతలో కొన్నాళ్ల పాటు అలా కొనసాగుతూనే ఉంటుంది. అలా లేటెస్ట్ గా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి కొన్నాళ్లపాటు హాట్ టాపిక్ కాగా ఇప్పుడు కనీసం ఏ సినిమాకు కూడా సైన్ చెయ్యని ఓ హీరోయిన్ క్రష్ గా మారిపోయింది.

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ ల కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో ఈమెనే హీరోయిన్ అంటూ కేరళ బ్యూటిఫుల్ హీరోయిన్ మానస రాధా కృష్ణన్ పేరు ఊపందుకుంది. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని దర్శకుడు హరీష్ వాటికి చెక్ పెట్టేసారు.

కానీ అంతకు ముందే ఈ హీరోయిన్ ను పవన్ ఫ్యాన్స్ బలంగా ఫిక్స్ అయ్యిపోయారు. అలాగే వారితో పాటుగా మిగతా కుర్రకారు కూడా ఈమెనే తమ కొత్త క్రష్ గా భావిస్తున్నారు. మరి టాలీవుడ్ లో ఈ అమ్మడుకి అవకాశాలు దక్కుతాయో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు