అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’ నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమాను నేడు రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీ పై అంచనాలు భారీగా క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. అయితే, ఈ సినిమాకు తొలి షో తో కొంతమేర మిక్సిడ్ టాక్ లభించింది.
దీంతో అభిమానులు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ను దక్కించుకుంటుందా అని కొంత ఆందోళన చెందారు. కానీ, అందరినీ సర్ప్రైజ్ చేసేలా ‘తండేల్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. ముఖ్యంగా ఏపీలో ఈ సినిమాకు లభిస్తున్న క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. మధ్యాహ్నం వరకు నార్మల్గా ఉన్న టికెట్ బుకింగ్స్ సాయంత్రం, నైట్ షోలకు ఫుల్ అయ్యాయి. ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడంతో హౌజ్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ఈ లెక్కన ‘తండేల్’ తొలిరోజు వసూళ్లు భారీగా నమోదు కావడం ఖాయమని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మేజర్ అసెట్గా మారగా, చందూ మొండేటి డైరెక్షన్, బన్నీ వాస్ నిర్మాణం బలాన్ని చేకూర్చాయి.