సుశాంత్, శాన్విలు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “అడ్డా” ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణ మొదలు పెట్టుకుంది. సాయి కార్తిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా శ్రీ నాగ కార్పోరేషన్ బ్యానర్ మీద నాగసుశీల, చింతలపూడి శ్రీనివాస రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున, అమల, పూరి జగన్నాథ్, నాగ చైతన్య, అఖిల్, నాగ సుశీల ఈ చిత్ర ప్రారంభంలో పాల్గొన్నారు. నాగార్జున క్లాప్ కొత్తగా అక్కినేని నాగేశ్వర రావు కెమరా ఆన్ చేశారు. పూరి జగన్నాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ” ఈ కథ మీద నేను దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం పని చేశాను ఈ చిత్రం ప్రారంభించడానికి ముందు 70 మంది విమర్శకుల అభిప్రాయాలను సేకరించాము. ఈ చిత్రం ఒక యాక్షన్ లవ్ స్టొరీ. ఈ చిత్రం మంచి చిత్రం అవుతుందని మాకు నమ్మకముంది.” అని దర్శకుడు సాయి కార్తిక్ చెప్పారు. సుశాంత్ దాదాపుగా రెండు సంవత్సరాల తరువాత ఈ చిత్రంతో తిరిగి తెర మీదకి రానున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
ప్రారంభమయిన సుశాంత్,శాన్విల “అడ్డా” చిత్రం
ప్రారంభమయిన సుశాంత్,శాన్విల “అడ్డా” చిత్రం
Published on Jul 28, 2012 11:41 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!