‘కుబేర’: ఈ ఇద్దరు వ్యక్తులకి స్పెషల్ అప్లాజ్!

చాలా రోజులు తర్వాత తెలుగు థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘కుబేర’. దర్శకుడు శేఖర్ కమ్ముల టాలెంటెడ్ హీరో ధనుష్ తో కింగ్ నాగార్జున కలయికలో చేసిన ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది. అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఒక ఇద్దరు వ్యక్తుల కోసం గట్టిగా వినిపిస్తుంది. వారే ఒకరు ధనుష్ అలాగే దర్శకుడు శేఖర్ కమ్ముల.

నటుడుగా ధనుష్ ఊహించని ట్రీట్ అందించాడని చెప్పవచ్చు. తన పెర్ఫామెన్స్ చూసిన ఆడియెన్స్ అంతా షాకవుతున్నారు. ఇది ఒకెత్తు అయితే అసలు తన పాత్రని సినిమాకి ఈ రకంగా మలచిన శేఖర్ కమ్ముల కోసం కూడా మాట్లాడుకోకుండా జనం ఉండలేకపోతున్నారు. మరి ఇలా ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ ఇద్దరు వ్యక్తులని పొగడకుండా ఆడియెన్స్ ఉండలేకపోతున్నారు.

Exit mobile version