30 ఏళ్ల ముందుకు వెళ్ళిపోతున్న హీరోయిన్

30 ఏళ్ల ముందుకు వెళ్ళిపోతున్న హీరోయిన్

Published on Nov 7, 2020 2:04 AM IST


‘జెర్సీ’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన నటి శ్రద్దా శ్రీనాథ్. ఆ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు బాగా ఇంప్రెస్ అయ్యారు. దాంతో ఆమెకు సినిమా ఆఫర్లు బాగానే పెరిగాయి. శ్రద్దా శ్రీనాథ్ చేయనున్న సినిమాల్లో ఒక బైలింగ్యువల్ ప్రాజెక్ట్ కూడ ఉంది. ఈ చిత్రం తమిళం, తెలుగులో రూపొందనుంది. ప్రమోద్ సుందర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఇందులో శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్ర చేయనుంది. ఈ సినిమా కథ రెగ్యులర్ సినిమాల్లా కాకుండా కొంచెం భిన్నంగా ఉంటుందట.

ఈ సినిమా కథ 2050 టైమ్ పిరియడ్లో సెట్ చేశారట డైరెక్టర్. అంటే ఇప్పుడున్న టైమ్ పిరియడ్ కంటే 30 ఏళ్ల ముందుఉంటుందన్నమాట కథ. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. సినిమా కథ చెన్నైలో జరుగుతుందట. ‘కలియుగం’ అనేది సినిమా టైటిల్. ఈ చిత్రం తన కెరీర్లోనే భిన్నమైనసినిమా అని, ఇలాంటి కథను ఇంతకుముందెప్పుడూ చూసి ఉండరని ఎగ్జైట్ అవుతోంది శ్రద్దా శ్రీనాథ్. ఈ సినిమాను ఆర్కే ఇంటర్నేషనల్ నిర్మించనుంది.

తాజా వార్తలు