3 చోట్లా బ్లాక్ బస్టర్ అయ్యిన “సంక్రాంతి వస్తున్నాం”

విక్టరీ వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి అలాగే ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కోసం అందరికీ తెలిసిందే. ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం రికార్డు వసూళ్లు అందుకొని సంచలనం రేపింది.

ఇక ఈ సినిమా థియేటర్స్ లోనే కాకుండా ఇపుడు ఓటిటి సహా స్మాల్ స్క్రీన్ పై కూడా కొత్త రికార్డులు అందుకున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇలా మేకర్స్ అఫీషియల్ గా ఇచ్చిన ప్రకటనతో సంక్రాంతికి వస్తున్నాం మొదటి టెలికాస్ట్ లో గత రెండేళ్లలో ఏ సినిమా కూడా అందుకోని రేటింగ్ 18.1 టీఆర్పీ సాధించినట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అలాగే ఇక ఓటిటి జీ5 లో అయితే 310 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కి పైగా అందుకొని జీ5 లో హైయెస్ట్ ఓపెనర్ గా నిలిచినట్టు చెబుతున్నారు. ఇలా మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఒక పక్క థియేటర్స్ లో ఇంకో పక్క బుల్లితెర మీద అలాగే వీటితో పాటుగా ఓటిటిలో కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం అనేది అరుదైన అంశం అని చెప్పాలి.

ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు థియేటర్స్ లో హిట్ అయినప్పటికీ స్మాల్ స్క్రీన్, ఓటిటిలలో ఫెయిల్ అవుతున్నాయి. మెయిన్ గా బిగ్ స్క్రీన్స్, ఓటిటిలో హిట్ అయినా బుల్లితెరపై రేటింగ్స్ మాత్రం అంతంత మాత్రమే వస్తున్నాయి. కానీ ఒక్క సంక్రాంతికి వస్తున్నాం మాత్రం ఈ మూడు చోట్లా సెన్సేషనల్ రెస్పాన్స్ తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీనితో సంక్రాంతికి వస్తున్నాం మేకర్స్ తమ సినిమా మూడు అంశాల్లో కూడా హిట్ అవ్వడంతో మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version