ఫిల్మ్ మేకర్స్ కంటే ఐఏఎస్‌ కావడం ఈజీ – సందీప్‌ రెడ్డి

ఫిల్మ్ మేకర్స్ కంటే ఐఏఎస్‌ కావడం ఈజీ – సందీప్‌ రెడ్డి

Published on Mar 2, 2025 1:00 PM IST

‘యానిమల్‌’ సినిమా గురించి గతంలో ఓ మాజీ ఐఏఎస్‌ అధికారి చేసిన కామెంట్స్ పై దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తాజాగా స్పందిస్తూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ సందీప్‌ రెడ్డి వంగా ఏం మాట్లాడారు అంటే..‘గతంలో ఒక ఐఏఎస్‌ అధికారి ఓ ఇంటర్వ్యూలో ‘యానిమల్‌’పై చేసిన కామెంట్స్ నన్ను బాధ పెట్టాయి. ఇలాంటి సినిమాలు అస్సలు తెరకెక్కించకూడదన్నది ఆయన అభిప్రాయం. యానిమల్ సినిమా సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకువెళ్లిపోయిందని ఆయన చెప్పారు.

ఆయన కామెంట్స్ నిజంగా నన్నెంతో బాధించాయి. నేను ఏదో నేరం చేశాననిపించింది. ఆయన అనవసరంగా నా సినిమా గురించి తీవ్ర విమర్శలు చేశారు. నేను ఒక్కటే అర్థం చేసుకున్నాను. ఐఏఎస్‌ అధికారి కావాలంటే.. దిల్లీ వెళ్లి ఏదైనా ఒక సంస్థలో చేరి కష్టపడి చదివితే చాలు. అదే ఫిల్మ్‌ మేకర్‌, లేదా రచయిత కావాలంటే ఎలాంటి కోర్సులు, టీచర్లు ఉండరు. నీకు నువ్వుగా అన్నీ నేర్చుకోవాలి. అభిరుచితోనే ముందుకు సాగాలి. ఇదే విషయాన్ని కావాలంటే నేను పేపర్‌పై కూడా రాసి ఇస్తాను’’ అని సందీప్‌ రెడ్డి వంగా చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు