సమంత, మణిరత్నం మరియు శంకర్ చిత్రాలను వదులుకున్నా కూడా ఆమెకి తమిళంలో మంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి రాజమౌళి “నాన్ ఈ ” చిత్ర విజయం తరువాత అందరి కళ్ళు “నీదానే ఎన్ పోన్వసంతం” చిత్రం మీద ఉంది. ఈ చిత్రానికి గౌతం మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘ఇళయదళపతి’ ప్రధాన పాత్రలో రానున్న ఒకానొక చిత్రం కోసం సమంతని సంప్రదించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి “నాన్న” మరియు “శివ తాండవం” చిత్రాలకు దర్శకుడిగా చేసిన ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహించనున్నారు. హీరో విజయ్ కి తమిళనాడులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2013లో విడుదల కానున్న చిత్రాలలో ఇది భారీ అంచనాలున్న చిత్రం ఒకవేళ ఈ చిత్రానికి సమంత సంతకం చేస్తే తమిళంలో స్టార్ డం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ నటి పలు తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం గౌతం మీనన్ “ఎటో వెళ్లిపోయింది మనసు” , దేవ్ కట్ట “ఆటో నగర్ సూర్య” , వి వి వినాయక్ “ఎవడు” , శ్రీకాంత్ అద్దాల “సీతమ్మ వాకట్లో సిరిమల్లె చెట్టు” మరియు నందిని రెడ్డి చిత్రంలో నటిస్తున్నారు.