‘లవ్ టుడే’ సినిమాతో తమిళ దర్శకుడు కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తెలుగులోనూ సాలిడ్ గుర్తింపును తెచ్చుకున్నాడు. కామెడీ రొమాంటిక్ చిత్రంతో తనదైన టైమింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ హీరో నటించిన రీసెంట్ మూవీ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్తో సందడి చేస్తుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 21న గ్రాండ్ రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా పూర్తి యూత్ఫుల్ కంటెంట్తో రావడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపారు. అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అందాల భామలు కయాదు లోహర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. ఇక బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ సర్కిల్స్లో టాక్ వినిపిస్తుంది. మరి నిజంగానే ఈ సినిమా మార్చి 28 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్కు వస్తుందా అనేది అధికారికంగా తెలియాల్సి తెలియాల్సి ఉంది.