గోవాలో వారిని చూసి షాక్ అయిన నాని.!

గోవాలో వారిని చూసి షాక్ అయిన నాని.!

Published on Aug 17, 2012 12:13 AM IST


నాని హీరోగా నటిస్తున్న ‘జెండా పై కపిరాజు’ చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్ స్పాట్ కి కొంత మంది ప్రముఖులు హాజరై నానిని ఆశ్చర్యానికి గురి చేశారు. వాళ్ళు ఎవరో అతని మాటల్లోనే విందాం.’ ప్రస్తుతం ‘జెండా పై కపిరాజు’ చిత్రీకరణ గోవాలో జరుగుతోంది, ఈ రోజు షూటింగ్ స్పాట్ కి కొంతమంది అతిధులు వచ్చారు, వారు ఎవరో చెప్పుకోండి చూద్దాం?.. ఎవరో కాదండి.. రాజమౌళి గారు, రమ గారు, వల్లి గారు, సాయి గారు మరియు కార్తికేయ అతిధులుగా వచ్చారు. వారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని’ నాని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. నాని మరియు రాజమౌళి కలిసి పనిచేసిన ‘ఈగ’ చిత్రం గత నెలలో విడుదలై టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రాజమౌళి తన కుటుంబంతో కలిసి గోవాకి వెకేషన్ వెళ్ళారని మేము ఇది వరకే తెలిపాము, అందువల్లే అక్కడే జరుగుతున్న నాని సినిమా షూటింగ్ స్పాట్ కి వెళ్ళారు. ‘జెండా పై కపిరాజు’ చిత్రంలో నాని సరసన అమలా పాల్ కథానాయికగా నటిస్తుండగా, సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఒక సామాన్యమైన వ్యక్తి నలుగురికి మంచి చేసే ఒక విషయం కోసం పోరాడటమే ఈ చిత్ర కథాంశం. ఈ నెల మొదట్లో కేరళలోని చలకుడిలో ప్రారంభమైన ఈ చిత్రం చిత్రీకరణ అక్కడ పూర్తవడంతో తదుపరి షెడ్యూల్ కోసం వెంటనే ఈ చిత్ర టీం గోవా చేరుకొని అక్కడ షూటింగ్ చేస్తున్నారు.

తాజా వార్తలు