‘పుష్ప’ కోసం దేవి కూల్‌ గా.. !


మహేష్ బాబు ‘శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను’ చిత్రాలకు బ్రహ్మాండమైన సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ ‘సరిలేరు నీకెవ్వరు’కు మాత్రం ఆ స్థాయిలో ట్యూన్స్ ఇవ్వలేకపోయాడనే వార్త ఫిల్మ్ వర్గాల్లో దేవి ఇమేజ్ ని డామేజ్ చేసింది. మరో పక్క తమన్ ఫుల్ ఫామ్ లో వరుస హిట్స్ ఇస్తుంటే.. దేవి మాత్రం రొటీన్ మ్యూజిక్ తో ఇబ్బంది పెడుతున్నాడని కామెంట్స్ వినిపించడంతో ‘దేవి శ్రీ’లో కసి పెరిగిందట. ప్రస్తుతం దేవి బన్నీ ‘పుష్ప’ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఈ సినిమాకి దేవి శ్రీ కసితో పనిచేస్తున్నాడని ఈ సారి సంగీతం అదరగొట్టేశాడని, సాంగ్స్ అన్నీ పూర్తి సంతృప్తిగా ఉండనున్నాయని తెలుస్తోంది. పైగా ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ ఈసారి కూల్‌ గా తీరిగ్గా కూర్చుని మ‌రీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తుండటం కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ కానుంది. ప్రస్తుతం దేవి ఐటమ్ సాంగ్‌ ను కంపోజ్ చేసే పనిలో ఉన్నాడ‌ట. మ‌రి సుకుమార్ – దేవీ కాంబినేష‌న్‌లో ఐటం సాంగ్స్ అంటే ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్ప‌న‌క్క‌ర్లేదు. మొత్తానికి పుష్ప సినిమా కోసం దేవి ప్రిపేర్ చేసే ఐటమ్ సాంగ్ మాస్ ప్రేక్ష‌కుల‌ను ఓ రేంజ్‌ లో ఊపేస్తుందనడంలో సందేహం లేదు.

Exit mobile version