ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డుల భరతం పట్టాడు పుష్పరాజ్.
వరల్డ్వైడ్గా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో రఫ్ఫాడించాడు అల్లు అర్జున్. ఈ సినిమాను రీలోడెడ్ వెర్షన్ పేరుతో అదనంగా మరో 20 నిమిషాల ఫుటేజీ యాడ్ చేసి రిలీజ్ చేశారు. దీనికి కూడా ప్రేక్షకులు సాలిడ్ రెస్పాన్స్ను అందించారు. ఇక ఇప్పుడు ఈ రీలోడెడ్ వెర్షన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
ఇక ఓటీటీ ఆడియెన్స్కు పుష్ప 2 ట్రీట్ అందించేందుకు ఈ చిత్రాన్ని జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు రెడీ అవుతున్నారు.