నిఖిల్ ‘అర్జున్ సురవరం’ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో మంచి వసూళ్లను రాబట్టి.. నిఖిల్ కెరీర్ లో బెస్ట్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. బ్లాక్ బస్టర్ మూవీతో ఊపు మీద ఉన్న హీరో నిఖిల్ త్వరలో పెళ్లి కొడుకు కానున్నాడు. భీమవరం అమ్మాయిని గోవాలో ప్రపొజ్ చేసి తనని మెప్పించి పెద్దల్ని ఒప్పించి ఎక్కడైతే ప్రపొజ్ చేసాడో అదే గోవాలో నిశ్చితార్థం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే డాక్టర్ పల్లవి వర్మ ని ప్రేమించిన నిఖిల్ అందరి సమ్మతితో ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. గోవాలో నిన్న పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఏప్రిల్ 16 న వివాహం చేసుకోబోతున్నాడు.
మొత్తానికి ‘అర్జున్ సురవరం’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత నిఖిల్ పెళ్లి కొడుకు కావటం శుభసూచకం. ఇక నిఖిల్ మరో క్రేజ్ సినిమాతో కూడా రాబోతున్నాడు. నిఖిల్ హీరోగా సుకుమార్ మరియు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఓ సినిమా రాబోతుంది. కాగా సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ రోల్ వెరీ ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.