“నాటకం” ఫేమ్ ఆశిష్ గాంధీ నుంచి సస్పెన్స్ థ్రిల్లర్.!

“నాటకం” ఫేమ్ ఆశిష్ గాంధీ నుంచి సస్పెన్స్ థ్రిల్లర్.!

Published on Nov 8, 2020 12:17 PM IST

‘‘నాట‌కం” చిత్రం ఫేమ్ ఆశిష్ గాంధీ అలాగే ‘’రంగుల‌రాట్నం” ఫేమ్ చిత్ర శుక్ల కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపొంద‌నుంది. రాజ్‌కుమార్ బాబీ ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. బాబీ ఏడిద క్రియేటివ్ వర్క్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎవ‌ర్‌గ్రీన్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ ప‌తాకంపై బాబీ ఏడిద‌, రాజేష్ బొబ్బూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఇక నిర్మాత‌లు మాట్లాడుతూ… “ఇదొక స‌స్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌.సినిమా ప్రారంభ స‌న్నివేశం నుంచి ఆఖ‌రి స‌న్నివేశం వ‌ర‌కూ చాలా ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఈ క‌థ‌లోని మ‌లుపులు ప్రేక్ష‌కుల్ని ఉర్రూత‌లూగిస్తాయి. `నాట‌కం` త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన ఆశిష్ గాంధీ ఈ చిత్రంలో హీరోగా న‌టించ‌నున్నారు. `రంగుల రాట్నం`, `సిల్లీ ఫెలోస్‌`, `మా అబ్బాయి` చిత్రాల ఫేమ్ చిత్ర శుక్ల ఇందులో క‌థానాయిక‌. ఇత‌ర తారాగ‌ణం వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం. డిసెంబ‌ర్ మొద‌టి వారం నుంచి రాజ‌మండ్రి, కాకినాడ‌, నిడ‌ద‌వోలు, రంప‌చోడ‌వ‌రం, గుడిసె, రాజాన‌గ‌రం త‌దిత‌ర ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతాం“ అని తెలిపారు.

ఈ ఈ చిత్రం సాంకేతిక వర్గం విషయానికి వస్తే క‌థ‌: బాబీ ఏడిద‌, ర‌చ‌న‌: స‌ర‌దా శ్యా‌మ్‌, డీఐ-విజువ‌ల్ ఎఫెక్ట్స్ : బ‌ండారు సాయి శ్రీ‌కాంత్‌, కాస్టూమ్, డిజైన‌ర్ : రూప‌రేఖ గుత్తి, ఛాయా గ్ర‌హ‌ణం: హ‌రిక్రిష్ణ (బెంగ‌ళూర్‌), సంగీతం: పెద్ద‌ప‌ల్లి రోహిత్‌, నిర్మాత‌లు: బాబీ ఏడిద‌, రాజేష్ బొబ్బూరి, ద‌ర్శ‌క‌త్వం: రాజ్‌కుమార్ బాబీ లు అందిస్తున్నారు.

తాజా వార్తలు