టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కుబేర’పై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయగా, ఇందులో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లీడ్ రోల్స్లో నటించారు. ఇక పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ను చిత్ర యూనిట్ తాజాగా ముంబైలో నిర్వహించారు.
ముంబైలో కుబేర ప్రెస్ మీట్ ఘనంగా నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ ప్రెస్ మీట్లో లీడ్ యాక్టర్స్ అందరూ పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున రష్మిక మందన్నపై కొన్ని వైరల్ కామెంట్స్ చేశారు. రష్మిక ట్యాలెంట్ ఉన్న ఒక పవర్హౌస్ అని.. ఆమె గత చిత్రాలు పరిశీలిస్తే.. బాక్సాఫీస్ దగ్గర రూ.2000, రూ.3000 కోట్ల సినిమాలు చేసింది రష్మిక అని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి ఫీట్ నాగ్తో పాటు తన తోటి యాక్టర్స్ ఎవరూ చేయలేకపోయారని ఆయన అన్నారు.
నాగ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో రష్మికపై నాగ్ చేసిన కామెంట్స్ను అభిమానుల నుంచి మిక్సిడ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇక కుబేర చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమాను జూన్ 20న గ్రాండ్ రిలీజ్కు రెడీ చేస్తున్నారు.