మణిరత్నం చిత్రం లో నటించబోతున్న సమంతా?

తాజాగా వచ్చిన పుకార్ల ప్రకారం మణిరత్నం రాబోతున్న చిత్రం “పూక్కాడై” చిత్రం లో ప్రధాన పాత్ర కోసం సమంతా ను ఎంపిక చేసుకున్నారు. గతం లో అక్షర హాసన్ లేదా రాధ రెండో కూతురు తులసి నటిస్తున్నారు అని పుకార్లు వచ్చాయి.ప్రముఖ హీరో కార్తీక్ తనయుడు గౌతం ఈ చిత్రం తో కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. చాలా రోజుల తరువాత మణిరత్నం మళ్ళి ప్రేమకథ ను ఎంచుకున్నారు ఈ విషయమే ఈ చిత్రం మీద అంచనాలు పెంచాయి.ఈ చిత్రం లో లక్ష్మి మంచు ఒక కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే ఖాళి లేక బిజీ గా ఉన్న సమంతా ఈ చిత్రం కోసం డేట్స్ ఎలా సర్దుబాటు చేసుకుంటుందో చూడాలి. ఈ చిత్ర షూటింగ్ ఈ నెలాఖరున మొదలు కాబోతుంది. దక్షిణ తమిళ నాడు లో చిత్రీకరణ జరుపుకోనుంది.

Exit mobile version