కృష్ణవంశీ తో పనిచేసేందుకు పదేళ్లుగా వేచి చూస్తున్నానని నటుడు గోపీచంద్ తెలిపారు.ఇంత కాలానికి నా నిరీక్షణ ఫలించిందన్నారు. “తొలి వలపు” సినిమాతో తెలుగు సినిమా అరంగేట్రం చేసిన గోపీచంద్ తాను అవకాశం కోసం ఇద్దరు దర్శకులను మాత్రమే కలిసానన్నారు. అందులో ఒకరు కృష్ణవంశీ కాగా మరొకరు తేజ. తనకు తేజ “జయం” అందించగా, కృష్ణవంశీ తో పని చేయటానికి పది సుదీర్ఘ సంవత్సరాలు హోల్డ్ లో ఉండాల్సి వచ్చిందన్నారు.
కృష్ణవంశీ తో కలసి పనిచేయటం పై గోపిచంద్ ఇలా స్పందించారు. “ఆయన ఒక సంస్థ. అతనితో పనిచేస్తున్నప్పుడు ఆర్జించే జ్ఞానం అపారం. దర్శకునిగానే కాక, సంగీతం, సాహిత్యం, పాటల చిత్రీకరణలో అతని ప్రతిభ చెప్పనలవి కాదు”. ‘మొగుడు’ సినిమా గురించి మాట్లాడుతూ బలమైన కుటుంభం మరియు మానవ సంబంధాల నేపధ్యంతో సాగే ఈ చిత్రం ప్రేక్షకుల మనసుకు వెంటనే హత్తుకు పోతుందని అభిప్రాయపడ్డారు.
అయితే…,’మొగుడు’ సినిమా నవంబర్ 4 వ తేదీన విడుదల కాబోతుంది.
మొగుడు సినిమాతో నాకల నెరవేరింది : గోపీచంద్
మొగుడు సినిమాతో నాకల నెరవేరింది : గోపీచంద్
Published on Oct 30, 2011 3:21 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘కింగ్డమ్’ సెన్సేషనల్ ఓపెనింగ్స్.. యూఎస్ మార్కెట్ లో అప్పుడే
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?