చిన్మయి ఘట్రాజు ఎట్టకేలకు రెండో చిత్రం చెయ్యబోతుంది గతం లో ఎల్.బి.డబ్ల్యు చిత్రం నటించిన ఈ భామ తరువాత ఏ చిత్రం లో కనిపించలేదు ఇప్పుడు బి.జయ దర్శకత్వం లో ఆది మరియు సన్వి ప్రధాన పాత్రల లో వస్తున్న “లవ్లీ” చిత్రం లో నటిస్తున్నారు. “ఎల్బిడబ్ల్యు” లో చిన్మయి నటనకు మంచి ప్రశంశలు అందుకుంది. ఈ చిత్రం జనవరి 12 వరకు చాలకుడి,కేరళ లో చిత్రీకరణ జరుపుకోనుంది. దీని తరువాత విదేశాల్లో పాటల చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రం లో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బ.జయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బి.ఏ.రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి మధ్యలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.