ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “కడల్”. ఒకేసారి తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ప్రముఖ నటుడు కార్తిక్ తనయుడు గౌతం హీరోగా పరిచయం కానున్నారు. కథానాయికగా ప్రముఖ నటి రాధ రెండవ కుమార్తె తులసి పరిచయం కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర తెలుగు వెర్షన్ కి “కడలి” అనే పేరుని పరిశీలిస్తున్నారు. సముద్రంలో చేపలు పట్టే జాలర్ల ప్రేమ కథ నేపధ్యంలో ఈ సినిమా సాగుతుంది కాబట్టి ఈ చిత్రానికి “కడలి” అనే పేరుని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంభందించిన కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రంలో చాలా భాగం కేరళలో తెరకెక్కిస్తున్నారు.లక్ష్మి మంచు,అరవింద్ స్వామి మరియు అర్జున్ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వనమాలి సాహిత్యం అందిస్తున్నారు. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.