ఆ స్టార్ హీరో కూడా వెనక్కుతగ్గనున్నాడట.

కరోనా ధాటికి మరో స్టార్ హీరో మూవీ విడుదల పోస్ట్ ఫోన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మూవీ విడుదల పోస్ట్ ఫోన్ కానున్నట్లు సమాచారం అందుతుంది. అజిత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వాలిమై. దర్శకుడు హెచ్ వినోద్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో అజిత్ పోలీస్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.

కాగా ఈ మూవీ విడుదల తేదీ దీపావళి నుండి 2021 సంక్రాంతికి మార్చనున్నారట. కరోనా ప్రభావంతో సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి చాల సమయం పట్టేలా కనిపిస్తుంది. ఈ తరుణంలో వాలిమై చిత్ర విడుదల పోస్ట్ ఫోన్ చేయనున్నారని సమాచారం. ఇక వాలిమై చిత్రాన్ని బోణి కపూర్ నిర్మిస్తున్నారు.

Exit mobile version