తమిళనాడులో పెరిగిన మహేష్ బాబు బ్రాండ్ వాల్యూ

తమిళనాడులో పెరిగిన మహేష్ బాబు బ్రాండ్ వాల్యూ

Published on Dec 2, 2012 2:17 AM IST

తమిళ హీరోలు మన పరిశ్రమ మార్కెట్ మీద ప్రభావం చూపడం చాలా రోజులుగా జరుగుతున్నదే రజినీ కాంత్ చిత్రం ఇక్కడ విడుదల అవుతుంది అంటే పెద్ద హీరో విడుదలకి ఉన్న సందడి జాబితాలోకి విక్రం, సూర్య మరియు కార్తి వచ్చి చేరారు. తాజాగా “తుపాకి” చిత్ర విజయంతో విజయ్ కూడా ఇక్కడ మార్కెట్ మీద పట్టు సాదించారు. కానీ మన టాలీవుడ్ హీరోలు తమిళ ఇండస్ట్రీ మీద పట్టు కాస్త తక్కువనే చెప్పాలి. మహేష్ బాబు చిత్రాలకు అక్కడ మంచి ఓపెనింగ్స్ ఉంటాయి కానీ ప్రస్తుతం అయన బ్రాండ్ వాల్యూ అక్కడ పెరుగుతూ ఉన్నట్టు తెలుస్తుంది. గతేడాది మణిరత్నం చిత్రంలో మహేష్ బాబు నటించాల్సి ఉంది, ఆ చిత్రం పలు కారణాల మూలాన మొదలు కాలేదు. “దూకుడు” మరియు “బిజినెస్ మాన్” చిత్రాలు అక్కడ విడుదల కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం “బిజినెస్ మాన్” చిత్రం అక్కడ 200 థియేటర్లలో విడుదల అవుతుంది 1000 థియేటర్లు మాత్రమే ఉన్న తమిళనాడు వంటి ప్రాంతాలలో ఒక డబ్బింగ్ చిత్రం ఈ స్థాయిలో విడుదల అవ్వడం రికార్డ్ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించనున్న “శివం” చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా తెరకెక్కించాలని అనుకుంటున్నారు. మరి అక్కడ ఎ చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో వేచి చూడాలి.

తాజా వార్తలు