సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం చాలా విరామం తరువాత సెప్టెంబర్ 17 నుండి హైదరాబాద్లో నూతన షెడ్యూల్ మొదలు పెట్టుకోనుంది. రెండు నెలల క్రితం ఈ చిత్రంలో ఒక పాటను అన్నపూర్ణ స్టూడియోస్ సెవెన్ ఎకర్స్ లో చిత్రీకరించారు తరువాత మహేష్ బాబు “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్ర చిత్రీకరణలో పాల్గొంటూ వచ్చారు. ఆ చిత్రంలో చాలా వరకు మహేష్ పాత్ర పూర్తవడంతో పాటు కాజల్ తిరిగి ఇండియా రావటంతో సుకుమార్ కొత్త షెడ్యూల్ ని ప్లాన్ చెయ్యాలని అనుకున్నారు. గోపీచంద్,ఆచంట రామ్ మరియు అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ బాబు చిత్రం కోసం దేవి శ్రీ ప్రసాద్ పని చెయ్యడం ఇదే మొదటి సారి తను మంచి ఆల్బం ఇస్తానని ఇప్పటికే అభిమానులకు ప్రమాణం చేశారు కూడా. ఈ చిత్రం మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది అని, మహేష్ బాబు కెరీర్ లో ఇదే స్టైలిష్ చిత్రం కానుంది అని అంటున్నారు.
సెప్టెంబర్ 17 నుండి మహేష్ – సుకుమార్ ల చిత్రం నూతన షెడ్యూల్
సెప్టెంబర్ 17 నుండి మహేష్ – సుకుమార్ ల చిత్రం నూతన షెడ్యూల్
Published on Sep 8, 2012 9:18 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ నుంచి సువ్వి సువ్వి సాంగ్.. థమన్ నుంచి బ్యూటిఫుల్ బ్యాంగర్
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!