మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, విలక్షణ నటుడు కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఎల్2 ఎంపురాన్’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్గా నిలిచింది. బ్లాక్బస్టర్ చిత్రం ‘లూసిఫర్’కు సీక్వెల్గా ఈ మూవీ రావడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపారు.
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ థ్రిల్లర్గా మేకర్స్ రూపొందించారు. కాగా, ఇప్పుడు ఈ సినిమా కూడా ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో ‘ఎల్2 ఎంపురాన్’ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా మలయాళంతో పాటు కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమాలో టోవినో థామస్, మంజు వారియర్, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దీపక్ దేవ్ సంగీతం అందించగా ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి.