కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ లో మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కుబేర”. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ సోషల్ డ్రామా మంచి టాక్ ని సొంతం చేసుకొని అదరగొట్టింది. అయితే పాన్ ఇండియా భాషల్లో విడుదల అయ్యిన ఈ చిత్రం తెలుగులో మాత్రం గట్టి డామినేషన్ ని చూపిస్తుంది.
ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు అందుకున్న ఈ సినిమా నైజాంలో సాలిడ్ ఓపెనింగ్స్ మొదటి రోజు అందుకున్నట్టు తెలుస్తుంది. పిఆర్ లెక్కల ప్రకారం కుబేర ఏకంగా 2.7 కోట్ల షేర్ (జిఎస్టీ కలిపి) ని అందుకున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. దీనితో ధనుష్ కెరీర్ లోనే కాకుండా ఈ మధ్య కాలంలో ఓ సినిమాకి గట్టి మొత్తం ఇది అని చెప్పవచ్చు. ఆల్రెడీ డే 2 బుకింగ్స్ కూడా అదిరినట్టు తెలుస్తోంది. ఇక ఇదే ఊపులో వీకెండ్ లో భారీ మొత్తమే కుబేర వెనకేసుకుంటుంది అని చెప్పాలి.