మంచు విష్ణు హీరోగా అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ లాంటి బిగ్ స్టార్స్ కలయికలో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే “కన్నప్ప”. హాలీవుడ్ లెవెల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ఈ సాయంత్రం రాబోతోంది.
అయితే ఈ ట్రైలర్ రన్ టైం ఇప్పుడు లాక్ అయ్యినట్టు తెలుస్తోంది. మొత్తం 2 నిమిషాల 55 సెకండ్ల నిడివితో అంచనాలు పెంచే విధంగా ఉండబోతుందట. అలాగే ఈ ట్రైలర్ ని మోహన్ లాల్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ సాయంత్రం 6 గంటల వరకు ఆగాల్సిందే.