జ్యోతిర్లింగాల యాత్రలో ‘కన్నప్ప’ టీమ్ !

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “కన్నప్ప”. ఈ చిత్రం కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. ఐతే, కన్నప్ప సినిమా విడుదలకు ముందు దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోబోతున్నట్లు హీరో విష్ణు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ను కన్నప్ప టీమ్ దర్శించుకుంది. అలాగే బద్రీనాథ్, రిషికేశ్‌లను కూడా సందర్శించారు. మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు చిత్ర బృందం అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది.

కాగా ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాకి మహా భారత్ సీరియల్‌ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టీఫెన్‌ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

పైగా ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి ఎంతోమంది అగ్ర నటీనటులు కనిపించనున్న విషయం తెలిసిందే. ‘కన్నప్ప’ చిత్రం అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ఇది భక్తి చిత్రం మాత్రమే కాదని, అదొక చరిత్ర అని మోహన్‌బాబు ఓ సందర్భంలో అన్నారు. ఈ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ఓ కీలక పాత్రలో నటించారు.

Exit mobile version