ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవ వేడుకలు.. ఎక్కడంటే?

క్రికెట్ అభిమానులు ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ 2025 సిద్ధమయ్యింది. మరికొద్ది రోజుల్లో ఈ క్రికెట్ టోర్నీ స్టార్ట్ కానుంది. ఇక ఈ టోర్నీ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు బిసిసిఐ ప్లాన్ చేస్తుంది. అయితే, ఎప్పటిలా కాకుండా, ఈసారి ప్రారంభోత్సవ వేడుకలను వైవిధ్యంగా నిర్వహించేందుకు బిసిసిఐ రెడీ అవుతుందట.

ఈసారి ఐపీఎల్ 2025 టోర్నీ జరగబోయే 13 వేదికలలోనూ ఈ ప్రారంభోత్సవ వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించాలని క్రికెట్ బోర్డు భావిస్తోంది. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. ఇక ఈ ప్రారంభోత్సవ వేడుకలో బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి హేమాహేమీలు పాల్గొంటారని తెలుస్తోంది.

మొత్తానికి క్రికెట్ మ్యానియాతో యూత్‌ను కట్టిపడేసేందుకు బిసిసిఐ చాలా గట్టి ప్లానింగ్ చేస్తుందని చెప్పాలి. మరి ఈ ప్రారంభోత్సవ వేడుకలు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.

Exit mobile version