మన టాలీవుడ్ నుంచి వచ్చిన పలు ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ హిట్ చిత్రాల్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ఆ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ అలాగే తన డెబ్యూ దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం “మంగళవారం” కూడా ఒకటి. అయితే ఈ చిత్రానికి కూడా మేకర్స్ సీక్వెల్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.
మరి ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ కొనసాగబోవడం లేదట. ఈసారి కొత్త నటి కనిపిస్తుంది అని టాక్. అలాగే ప్రస్తుతం అజయ్ భూపతి పార్ట్ 2 స్క్రిప్ట్ ని కంప్లీట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇలా అతి త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టుకోనుందట. మరి ఈసారి కనిపించేది ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ మున్ముందు బయటకి రానున్నాయి.