బాలీవుడ్ హాట్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ తెలుగులో పూరీ జగన్నాథ్- ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఏక్ నిరంజన్ చిత్రంలో నటించింది. అయితే అంతకన్నా ముందే టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్నానని కంగన చెప్పింది. మహష్ – పూరీ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రం పోకిరి. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. తెలుగు సినిమా చరిత్రలో నయా రికార్డుల్ని నెలకొల్పింది పోకిరి.
ఈ చిత్రంలో హీరోయిన్ ఇలియాన ఒక్కసారిగా స్టార్డమ్ సంపాందించి, టాప్ హీరోయిన్గా ఎదిగింది. అయితే పోకిరి చిత్రంలో నటించే అవకాశం, ముందుగా తనకే వచ్చిందన, అయితే ఆ అవకాశాన్ని తాను వినియోగించుకోలేకపోయానని కంగన వెల్లడించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంగన మాట్లాడుతూ.. గ్యాంగ్స్టర్ సినిమా ఆడిషన్స్కు వెళ్లిన సమయంలోనే, పోకిరి సినిమా ఆడిషన్స్ జరిగాయని.. ఈ రెండు చిత్రాలకు తాను ఎంపికయ్యానని.. అయితే ముందుగా గ్యాంగ్స్టర్ మూవీకి డేట్స్ ఇచ్చేయడంతో, పోకిరి చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది. దీంతో టాలీవుడ్ గేమ్ ఛేంజర్గా మారిన పోకిరి చిత్రాన్ని కంగనా అలా మిస్ చేసుకందన్న మాట.