బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ !

నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా కనిపించనున్నారు. ఐతే, మేకర్స్ ఈ దీపావళికి అక్టోబర్ 24, 2025న సాయంత్రం 4:54 గంటలకు ప్రమోషనల్ అప్‌డేట్ వస్తుందని ప్రకటించారు. ఈ అప్‌ డేట్, ఈ సినిమా మొదటి సింగిల్ ప్రకటన కావచ్చునని అభిమానులు ఊహిస్తున్నారు.

కాగా తమన్‌ స్వరాలు అందిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్రబృందం ఇప్పటికే స్పష్టం చేసింది. అన్నట్టు ఇప్పటికే, విడుదలైన ఈ సినిమా టీజర్‌ ట్రెండ్‌ సృష్టించిన విషయం తెలిసిందే. అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆది పినిశెట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Exit mobile version