పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా పోస్ట్ – ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ ముగిసింది. దేవీ శ్రీ ప్రసాద్ ఫస్ట్ హాఫ్ కి రీ – రికార్డింగ్ త్వరలో మొదలుపెట్టనున్నాడని సమాచారం. పూరి జగన్నాథ్ ఈ సినిమా చాలా వేగంగా, అలాగే చాలా జాగ్రత్తగా షూట్ చేస్తున్నారు. ఈ సినిమాని దాదాపు రెండు నెలలు బార్సిలోనాలో, కొద్ది రోజులు బ్యాంకాక్ లో, మిగిలిన బాగాన్ని హైదరాబాద్లో షూట్ చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, అమలా పాల్ , కేథరిన్ లు హీరోయిన్స్ గా యాక్షన్ , రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆరు రోజుల్లో ఈ సినిమా ట్రైలర్ ని 1మిలియన్ మంది చూశారు. ఈ సినిమాకి ఎస్.ఆర్.శేఖర్ ఎడిటర్ గా, అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాని మే 10న విడుదల చేయనున్నారు.
ఇద్దరమ్మాయిలతోకి మొదలు కానున్న దేవీ శ్రీ ఆర్.ఆర్
ఇద్దరమ్మాయిలతోకి మొదలు కానున్న దేవీ శ్రీ ఆర్.ఆర్
Published on Apr 14, 2013 3:30 AM IST
సంబంధిత సమాచారం
- ‘బిగ్ బాస్ 9’.. మొదటి ఎలిమినేట్ ఎవరంటే ?
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- అప్పుడు ఇడ్లీకి కూడా డబ్బులు లేవు – ధనుష్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- ‘మహేష్’ సినిమా కోసం భారీ కాశీ సెట్ ?
- పరిపూర్ణ రచయితగా ఎదగాలనేది నా బలమైన కోరిక – గీత రచయిత శ్రీమణి
- పవన్ ఆ విద్యను ప్రోత్సహించాలి – సుమన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘ఓజి’, ‘ఉస్తాద్’ లని ముగించేసిన పవన్.. ఇక జాతరే
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?
- బాలయ్య ‘అఖండ 2’లో మరో గెస్ట్ రోల్ ?
- నాని ‘ప్యారడైజ్’లో మోహన్ బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి