ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న లీడ్ రోల్స్లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కుబేర’. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా తాజాగా చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఇందులో ధనుష్ పవర్ఫుల్ స్పీచ్తో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇంతకీ, ధనుష్ ఏం మాట్లాడారు అంటే.. ‘నేనెప్పుడు నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తుంటాను. నాపై, నా సినిమాలపై ఎంత నెగెటివ్ ప్రచారం చేస్తారో చేసుకోండి. నా సినిమాల విడుదలకు ముందు నెలకు రెండుసార్లు ఏదో ఒక విషయంలో కుట్రలు చేస్తూనే ఉంటారు. అయినా మీరేం చేయలేరు. ఎందుకంటే నా అభిమానులు ఎప్పుడూ నాతో ఉన్నారు. ఇలాంటి సర్కస్లు మానుకోండి. ఇక్కడ ఉన్నవారంతా నా అభిమానులు మాత్రమే కాదు.. 23 సంవత్సరాలుగా నా వెంటే ఉంటున్న ఫ్యామిలీ మెంబర్స్’ అంటూ ధనుష్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి చెప్పుకొచ్చారు.