ఈరోజు రాత్రి నుండి “దమ్ము” చిత్ర ప్రింట్ల పంపిణి

ఈరోజు రాత్రి నుండి “దమ్ము” చిత్ర ప్రింట్ల పంపిణి

Published on Apr 25, 2012 11:50 AM IST


యంగ్ టైగర్ ఎన్టీయార్ “దమ్ము” మరో రెండు రోజుల్లో విడుదల కానుంది ఈ చిత్రం పరిశ్రమలో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. నిన్న మేము చెప్పిన విధంగా ఈ చిత్ర ప్రింట్లకు డిమాండ్ ఏర్పడింది. మొదటి విడత ప్రింట్లు పంపిణికి సిద్దమయ్యింది. ఎమిరేట్స్ ఫ్లైట్ ద్వారా అమెరికా ప్రింట్లు ఈరోజు రాత్రి బయలుదేరనున్నాయి. యు.కే కి ఇరవై భౌతిక ప్రింట్లు 45 డిజిటల్ ప్రింట్లు పంపనున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. త్రిష మరియు కార్తీక ప్రధాన పాత్రలు పోషించారు. ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద కే.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాల కోసం 123తెలుగు.కాం ని ఫాలో అవ్వండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు