హీరో నితిన్ 2020 లో భీష్మ రూపంలో హిట్ అందుకున్నారు. ఏడాదికి పైగా గ్యాప్ తరువాత వచ్చిన నితిన్ కి ఓ సాలిడ్ హిట్ దొరికింది. దర్శకుడు వెంకీ కుడుముల యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఈ చిత్రాన్నితెరకెక్కించారు. ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. కాగా ఈ హిట్ మూవీని హిందీలో రీమేక్ చేయనున్నారట.
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో ఉండగా స్టార్ హీరో రన్బీర్ కపూర్ నితిన్ రోల్ చేస్తారట. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కలదు . ప్రస్తుతం రన్బీర్ బ్రహ్మాస్త్ర అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. కింగ్ నాగార్జున సైతం ఈ మూవీలో ఓ రోల్ చేస్తున్నారు.