కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కూలీ”. గట్టి అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం తెలుగు యువత కూడా మంచి ఆసక్తిగా ఉన్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కూలీ క్రేజీ బుకింగ్స్ ని నమోదు చేస్తుంది.
నిన్ననే తెలుగు బుకింగ్స్ ఓపెన్ కాగా కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 4 లక్షలకి పైగా టికెట్స్ బుక్ అయినట్టుగా అధికారికంగా సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో కూలీ మేనియా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ సినిమా ఆ అంచనాలు ఏ మేరకి అందుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఉపేంద్ర, కింగ్ నాగ్, అమీర్ ఖాన్ లాంటి బిగ్ స్టార్స్ కూడా నటించారు. అలాగే సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాని నిర్మాణం వహించారు.
There’s no ‘LOOKING’ back ????#CoolieTelugu smashes past 400K+ tickets sold across AP & TG???????? #Coolie Grand release tomorrow ????
Book your tickets now ????️Telugu States release by @asianreleases pic.twitter.com/nZ0HkyHIPl
— Asian Distribution (@asianreleases) August 13, 2025