పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు పూరి జగన్నాథ్ ల కలయికలో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న చిత్రం “కెమెరామెన్ గంగతో రాంబాబు” ఆడియో విడుదల సెప్టెంబర్ 21న జరుపుకోనుంది. ఈ చిత్రం ఇప్పటికే టాకీ భాగం మొత్తం పూర్తి చేసుకుంది. మరో రెండు వారాల్లో చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకోనుంది. తమన్నా కథానాయికగా ఈ చిత్రంలో కనిపించనుంది. టివి జర్నలిస్ట్ పాత్రలో తమన్నా పవన్ సరసన కనిపించనున్నారు. గబ్రియేల బెర్తంతే మరియు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా డి వి వి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ఆడియో కూడా “గబ్బర్ సింగ్” చిత్ర ఆడియోలానే విజయం సాదిస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకుంటున్నారు. ఈ మధ్యనే విడుదల చేసిన పోస్టర్స్ కి అద్భుతమయిన స్పందన కనిపించింది ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమయ్యింది. ఈ ఏడాది విడుదల అవుతున్న పవన్ కళ్యాణ్ రెండవ చిత్రం ఇది కావడం అభిమానులకు ఉత్సాహనిచ్చే అంశం.
సెప్టెంబర్ 21న కెమరామెన్ గంగతో రాంబాబు ఆడియో
సెప్టెంబర్ 21న కెమరామెన్ గంగతో రాంబాబు ఆడియో
Published on Sep 8, 2012 5:19 PM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- ‘ఓజి’ నెక్స్ట్ ట్రీట్ కోసం అంతా వెయిటింగ్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘కింగ్డమ్’
- 2025 ఓవర్సీస్ మార్కెట్ లో ‘కూలీ’ లీడ్ లో ఉందా?
- ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న ‘మిరాయ్’
- ‘ఓజి’ అసలు ఆట రేపటి నుంచి!
- అనుష్క ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ న్యూస్!
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్గా ఆస్కార్కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!