తమిళ హీరో విజయ్ తన తన టీవీకే పార్టీ ప్రచారం కోసం తమిళనాడులో కరూర్ జిల్లాలో నిర్వహించిన ప్రచారసభలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించిన విషాదకర ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో గాయపడిన మరో 50 మందికి పైగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో, మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే, ఈ దురదృష్ట ఘటనపై ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఈ దుర్ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. ‘తమిళనాడులోని కరూర్లో జరిగిన ర్యాలీలో జరిగిన దురదృష్టకరమైన తొక్కిసలాట ఘటన నన్ను చాలా తీవ్రంగా కలిచివేసింది. ఈ భరించలేని నష్టాన్ని అనుభవిస్తున్న కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి ధైర్యం కలగాలని కోరుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’ అంటూ చిరంజీవి ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టారు.
Deeply saddened by the tragic stampede at the rally in Karur, Tamil Nadu.
My sincere condolences to the families who are living through this unbearable loss. I wish them strength in this difficult time and pray for the speedy recovery of those injured.
Om Shanti ????— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2025