OTTలోకి ‘చౌర్యపాఠం’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

టాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన క్రైమ్ కామెడీ చిత్రం ‘చౌర్యపాఠం’ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ సినిమాను ‘ధమాకా’ చిత్ర దర్శకుడు త్రినాథరావు నక్కిన ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ సినిమాలో ఇంద్రరామ్ హీరోగా నటించాడు. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయింది.

అయితే, థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన చౌర్యపాఠం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను నిఖిల్ గొల్లమారి డైరక్ట్ చేశారు. మరి ఈ చిత్రానికి ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version