ముఖ్యమంత్రిని కలిసిన చండీ యూనిట్

ముఖ్యమంత్రిని కలిసిన చండీ యూనిట్

Published on Nov 18, 2013 8:00 AM IST

Chandi-Team
ప్రియమణి ప్రధాన పాత్రలో కృష్ణం రాజు, శరత్ కుమార్ లు నటించగా ప్రముఖ దర్శకుడు వి సముద్ర దర్శకత్వం లో ఒమిక్స్ క్రియేషన్ పతాకం పై డా. శ్రినుబాబు నిర్మించిన చండీ చిత్ర యూనిట్ ఇటివలే రాష్ట్ర ముఖ్యమంత్రి కె. కిరణ్ కుమార్ రెడ్డిని కలిసింది. ప్రబుత్వ గ్రేడ్ 4 ఎంప్లాయిస్ ఇళ్ళ స్థలాల కోసం ఎపిఎన్జీవోలతో కలిసి చండీ టీం ముఖ్య మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో తక్కువ వేతనాలు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు (అంటే పంట పొలాలకు నీటిని అందించే వారు) 1995లో కాకినాడ డివిజన్, కాకినాడ మండలంలోని రమణయ్య పేట చానల్, 3/5 నుండి 4/5 కిలోమీటర్ వరకు ఒక్కొక్క ఉద్యోగికి గతంలో అంటే 2001లో 120 గజాల చొప్పున స్తలం కేటాయించడం జరిగింది. అయితే దానికి సంబందించిన పత్రాలు ఇప్పటివరకు వారికి అందలేదు. వారు ఎన్నో రోజులుగా దానికోసం కాళ్ళరిగేల తిరిగిన కుడా ఎలాంటి పలితం లేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్న చండి యూనిట్ వారితో కలిసి ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారికి తగిన న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దర్శకుడు సముద్ర , సహా నిర్మాత ముమ్మిడి సత్య తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.

తాజా వార్తలు