నటసింహం బాలయ్య నెక్స్ట్ మూవీ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ ఓ షెడ్యూల్ పూర్తి చేసుకోగా లాక్ డౌన్ అనంతరం నెక్స్ట్ షెడ్యూల్ మొదలుకానుంది. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సూపర్ హిట్స్ అందుకున్నాయి. దీనితో ఈసారి బాలయ్య బోయపాటి డైరెక్షన్ లో బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయం అని తెలుస్తుంది.
కాగా ఈ మూవీలో బాలయ్యకి సవాల్ విసరడానికి భారీ విలన్స్ ని బోయపాటి దింపనున్నాడట. ఇప్పటికే హీరో శ్రీకాంత్ ని ఒక విలన్ గా తీసుకోగా, మరో విలన్ ని బాలీవుడ్ నుండి దింపాలనే ఆలోచనలో ఉన్నారట. బాలయ్య బోయపాటి సినిమాలంటే భారీ యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరు. కావున ఈ సినిమా కోసం భారీగా శత్రు గణాన్ని బోయపాటి సిద్ధం చేస్తున్నారట . భయకరమైన విలన్స్ మరియు బాలయ్య మధ్య వచ్చే సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉన్నాయని టాక్. ఇక ఈ చిత్రానికి నిర్మాతగా మిర్యాల రవీంధర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.