బాలయ్య బాబు ప్రస్తుతం వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి చిత్రాలతో వరుస హిట్లు అందుకుని ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ‘అఖండ-2’ సినిమా చేస్తున్నాడు. అలాగే, గోపీచంద్ మలినేని, బాలయ్యతో మరో మూవీ చేస్తున్నాడు. గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం స్క్రిప్ట్ ను పూర్తి చేసాడు. కాగా సెకండ్ హాఫ్ లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉంటాయని.. అందుకు తగ్గట్టు.. సెకండ్ హాఫ్ లో బాలయ్య పాత్ర పై ఓ ఫ్లాష్ బ్యాక్ ను ప్లాన్ చేశారట.
ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. కాగా వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు దీనిని నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి గోపీచంద్ మలినేని ఎక్స్ వేదికగా ఆ మధ్య స్పందిస్తూ.. ‘‘గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది’’ అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ నటించనున్న 111 ప్రాజెక్ట్ ఇది.