బుల్లితెర స్టార్ యాంకర్ మరియు నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా ఓ సామాజిక సందేశం ఇచ్చారు. ఆమె రైతులకు అండగా నిలబడదాం అని పిలుపునిచ్చారు. కరోనా కర్ఫ్యూ కారణంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతున్నారు. వారు పండించిన పళ్ళు, కూరగాయలు కొనడం ద్వారా వారికి చేయూతనిద్దాం అన్నారు. రైతు దేశానికి వెన్నెముక వారిని కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. ఈ వీడియోని అనసూయ తన అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
ఇక అనసూయ జబర్ధస్త్ యాంకర్ గా కొనసాగుతూనే హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. గత ఏడాది విడుదలైన కథనం సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించడం జరిగింది. ఇక క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరక్కుతున్న రంగమార్తాండ చిత్రంలో ఓ కీలక రోల్ చేస్తున్నారు.