ఆసుపత్రిలో చేరిన 30 ఇయర్స్ పృథ్వీ

టాలీవుడ్‌లో ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ అనే డైలాగ్‌లో పాపులర్ అయిన 30 ఇయర్స్ పృథ్వీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘లైలా’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. అయితే, ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ చేసిన కొన్ని కామెంట్స్ పై సోషల్ మీడియాలో ఓ రాజకీయ పార్టీ తెగ ట్రోలింగ్ చేసింది.

ఆయన చేసిన వివాదాస్పద కామెంట్స్ వల్ల తమ సినిమాకు డ్యామేజ్ అయ్యేలా ఉందని గమనించిన చిత్ర నిర్మాత సాహు గారపాటి తో కలిసి హీరో విశ్వక్ సేన్ మీడియా ముందుకు వచ్చి తమ వివరణ కూడా ఇచ్చారు. అయితే, ఇప్పుడు తాజాగా 30 ఇయర్స్ పృథ్వీ ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. హై బీపీ కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చేరారని.. హై బీపీకి ఆయన చికిత్స తీసుకుంటున్నాడని ఈ వీడియోలో కనిపిస్తుంది. దీంతో పృథ్వీ ఆరోగ్యంపై లైలా మూవీ యూనిట్ ఆరా తీస్తున్నారు.

Exit mobile version