నటి, నిర్మాత మంచు లక్ష్మి తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. 15 ఏళ్ల వయసులో తన జీవితంలోని చేదు జ్ఞాపకాన్ని
ఆమె గుర్తుచేసుకున్నారు. తాను ఎదుర్కొన్న పరిస్థితి గురించి మంచు లక్ష్మి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా చిన్నతనంలో అమ్మే నన్ను రోజూ స్కూల్కి తీసుకెళ్లేది. ఐతే, బాడీ గార్డ్స్, డ్రైవర్స్ కూడా ఉండేవారు. కానీ, ఓసారి హాల్ టికెట్ల కోసం పాఠశాల వాళ్లే మమ్మల్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్తారని తెలిసి ఎంతో ఆనందించాను. కానీ, ఆ ప్రయాణం భయంకరమైంది’ అని మంచు లక్ష్మి తెలిపింది.
ఈ విషయం గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తు ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో హాల్ టికెట్ కోసం నేను వెళ్లాను. ఆ సమయంలో ఓ వ్యక్తి నన్ను చాలా అసభ్యంగా తాకాడు. ఆ సమయంలో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత ఆ విషయం గురించి నా స్నేహితులకు చెప్పాను. సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకే అలాంటి పరిస్థితి ఎదురైంది. ఇక ప్రజా రవాణాలో ప్రయాణించే సాధారణ మహిళలు ఇలాంటివి ఎదుర్కొంటుంటారు. కానీ బయటకు చెప్పుకోలేరు’ అని మంచు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.


